ఆంధ్రప్రదేశ్‌

హోదాను అడ్డుకున్నది బాబే: భూమన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాల్సిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాలకోసం హోదా అంశాన్ని కేంద్రం ముందు తాకట్టుపెట్టి సమాధికట్టిన ఘనుడని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. గురువారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన స్వార్థంతో బీజేపీతో చేతులు కలిపి, ప్యాకేజీలు సంజీవిని అంటూ భుజాలెగరేసుకుంటూ ప్రత్యేక హోదాకు బాబు సమాధిని కట్టాడన్నారు. జగన్ పోరాట ఫలితమే నేడు ప్రజల్లో కూడా ప్రత్యేక హోదాపై చైతన్యం వచ్చిందన్నారు. జగన్ పాదయాత్రను చూసి భయపడి ఆయనపై బాబు నిందారోపణలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాకు కూడా న్యాయంచేయలేని అసమర్థుడు బాబు అని మండిపడ్డారు.