తెలంగాణ

నల్లగొండ కాంగ్రెస్ నేతలు అవినీతి పుట్టలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్న రోజుల్లో కాంగ్రెస్ నాయకులు సీమాంధ్ర పాలకులకు పాద సేవ చేస్తూ, ద్రోహులకు సద్దులు మోసారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. టిఆర్‌ఎస్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతుండటంతో ఇక ఎప్పటికీ అధికారం దక్కదన్న అక్కసుతోనే కాంగ్రెస్ నేతలు సిఎం కేసీఆర్ కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని టిఆర్‌ఎస్ మండిపడింది. టిఆర్‌ఎస్ శాసనసభా పక్షం కార్యాలయంలో సోమవారం నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వేముల వీరేశం, నల్లమోతు భాస్కర్‌రావు, ఫైళ్ల శేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకులకు ఒకరంటే ఒకరికి గిట్టదన్నారు. అలాంటి నేతలంతా ఒక వేదికపైకి వచ్చారంటే సిఎం కేసీఆర్ చూసి వారు ఏ స్థాయిలో భయపడుతున్నది అర్థం అవుతుందన్నారు. టిఆర్‌ఎస్ హయాంలో అవినీతి జరుగుతోందని పెడ బొబ్బలు పెడుతున్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్, దామోదర్‌రెడ్డి తదితరులు రాజకీయాల్లోకా రాకముందు వారి ఆస్తులెంతా? ప్రస్తుతం ఉన్న ఆస్తులు ఎంతో విచారణకు సిద్ధమా అని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ కాంగ్రెస్ నేతలకు డిపాజిట్లు కూడా దక్కవని అన్నారు.కాంగ్రెస్ పార్టీకి 2019 ఎన్నికలే చివరి ఎన్నికలు కాబోతున్నాయని టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధ్వజమెత్తారు.