తెలంగాణ

నాడు కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాటలను నిజం చేసిన కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 25: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన మాటలను అపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు నిజం చేశారని టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ వారికి పాలన చేతకాదని కిరణ్‌కుమార్ రెడ్డి అనే వారని, ఇప్పుడు అవే మాటలను కేసీఆర్ నిజం చేవారని పొన్నం మంగళవారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ అన్నారు. దేశంలో తామే నెంబర్-1గా ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ 9 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్ళారని ఆయన ప్రశ్నించారు. అపద్ధర్మ మంత్రి కేటీఆర్ ముఖంలో మొదటిసారి ఓడిపోతామన్న భయం కనిపించిందన్నారు. అందుకే ఒక్క ఓటుతోనైనా గెలిపించాలని ప్రజలను కోరుతున్నారని ఆయన తెలిపారు. సిరిసిల్లలో మరగుదొడ్ల నిర్మాణంలో కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపించారు. జిల్లాలోని ఏ వాగు చూసినా ఇసుక కుంభకోణమే కనిపిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. ఏ గ్రామంలో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరగలేదని ఆయన విమర్శించారు.