తెలంగాణ
దళితులపై కాల్పులను ఖండిస్తున్నాం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భువనగిరి, ఏప్రిల్ 3: ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టాన్ని నీరుగారుస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్న దళిత ఆందోళనకారులపై దుర్మార్గంగా కాల్పులు జరపడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండిస్తుందని మాజీ ఎంపీ బృందాకారత్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో మతతత్వ రాజకీయాలు-జాతీయ సమగ్రత అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్ పాల్గొనేందుకు విచ్చేసిన బృందాకారత్ విలేఖ రుల సమావేశంలోమాట్లాడుతూ దళిత ఆందోళనకారులపై ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్తోపాటు ఇతర రాష్ట్రాల్లో కాల్పులు జరపడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. కాల్పులలో 10 మంది దళితుల మరణం మోడీ ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. అమిత్షా కుమారుడు జైషాకు ఒకన్యాయం, దళితులకు మరో న్యాయమా? అని బృందాకారత్ ప్రశ్నించారు. బిజెపి ద్వంద్వ విధానాలు అవలంబి స్తోందని జైషాకు వ్యతిరేకంగా తీర్పు రావడంతోనే కేంద్ర ప్రభుత్వం అడిషినల్ సొలిసిటర్ జనరల్ను పంపి వాదించి కాపాడారు, దళితుల రక్షణ కల్పించే ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చేలా తీర్పువస్తే బీజేపీ ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ను పంపలేదని విమర్శించారు.