తెలంగాణ

గుడిపల్లి పంప్‌హౌస్‌లో ఇద్దరు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపాల్‌పేట, అక్టోబర్ 13: వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిదిలోని గుడిపల్లి లిఫ్ట్ పంప్‌హౌస్‌ను కుటుంబ సభ్యులతో కలిసి సందర్శిస్తుండగా ప్రమాద వశాత్తు నీటిలోపడి ఇద్దరు వ్యక్తులు గల్లంతు అయ్యారు. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెల్కపల్లి మండల కేంద్రంలో జరిగిన ఒక శుభకార్యానికి వచ్చిన వారిలో 9 మంది గుడిపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించడానికి వచ్చారు. పంప్‌హౌస్‌ను చూస్తున్న సందర్బంగా నీడి వద్దకు వెళ్లడంతో అబ్దుల్ అమీద్ నీటిలో కొట్టుకొని పోతుండగా అతని రక్షించడానికి ప్రయత్నించిన ఇసాక్ కూడా పంపహౌస్ నీటిలోపడి గల్లంతయ్యారు. విషయాన్ని తెలుసుకున్న రెవెన్యూ, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గల్లంతైన వారిని వెతకడంకోసం ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకున్నారు. చీకటి కావడంతో పంప్‌హౌస్ దగ్గర లైట్లను ఏర్పాటు చేసి గల్లంతైన వారిని వెతకడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. నాగర్ కర్నూల్ ఆర్డీఓ మధుసూధన్, గోపాల్‌పేట ఎస్సై జగన్‌మోహన్ సంఘటనా స్థలంత వద్ద ఉండి వెతకడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.