రాష్ట్రీయం

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల: కాపురానికి రావద్దు అన్నారని నంద్యాల మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలు ఇలా ఉన్నాయి. పాండురంగాపురం గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి అనే సాధారణ రైతుకు చందన అనే కుమార్తె ఉన్నది. ఎమ్మెస్సీ చదివిన చందనను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న గుంటూరు జిల్లా సంగం జాగర్లమూడి గ్రామానికి చెందిన ఉమామహేశ్వరెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. ఇటీవలనే కొడుకు తొలి పుట్టినరోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా తలెత్తిన మనస్పర్థల కారణంగా పుట్టింట్లో ఉన్న చందనను మళ్లీ రావద్దని అత్తింటివారు అనటంతో మనస్థాపానికి గురై ఆమె బుధవారంనాడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు అత్తింటివారిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.