రాష్ట్రీయం
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 6 May 2019
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. నేడు, రేపు ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సోమ, మంగళవారాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని, చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని అధికారులు దాతలను కోరుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. అలాగే పశువులకు నీటి తొట్టెల ద్వారా నీటిని ఏర్పాటు చేయాలని పశుసంవర్ధకశాఖ అధికారులు సూచించారు.