తెలంగాణ

బంద్‌కు ప్రజల మద్దతు లేదు: హరీష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతిపక్షాలన్నీ పిలుపు ఇచ్చినప్పటికీ సోమవారం మెదక్ జిల్లా బంద్ విఫలమైందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన తెరాస భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర పన్నుతున్న విపక్షాలు మల్లన్నసాగర్ నిర్వాసిత రైతులను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందేలా వ్యవహరిస్తున్నాయన్నారు. మల్లన్నసాగర్ వల్ల 8 గ్రామాలకు ముంపు సమస్య ఏర్పడుతుందని, ఇప్పటికే ఆరు గ్రామాల రైతులు భూములిచ్చేందుకు ముందుకు వచ్చారని ఆయన తెలిపారు. నిర్వాసిత రైతులు కోరుకున్న విధంగానే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు.