తెలంగాణ

జాతీయ భావం నింపేందుకే తిరంగా యాత్ర : వెంకయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదద్‌: దేశ సమైక్యతకు అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని, అందరిలో జాతీయ భావం నింపేందుకే తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్‌ కేబీఆర్‌ పార్కు వద్ద ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకయ్య మాట్లాడుతూ, కులం, మతం పేరుతో కొంత మంది రాజకీయాలు చేస్తున్నారని, అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మనమంతా భారతీయులమన్న భావన మరచిపోకూడదన్నారు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి ప్రారంభమైన తిరంగా యాత్ర.. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు, ఫిలింనగర్‌ చౌరస్తా, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రి మీదుగా తిరిగి కేబీఆర్‌ పార్కు వరకు నిర్వహించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, భాజపా నేతలు ముళీధర్‌రావు, లక్ష్మణ్‌, కిషన్‌రెడ్డి, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.