తెలంగాణ
హుజుర్నగరలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 24 October 2019
హైదరాబాద్:హుజుర్నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. ఆయన 43,624 ఓట్ల మెజార్టీ విజయం సాధించారు. 22వ ఆఖరి రౌండ్లో భారీ మేజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. కాగా సైదిరెడ్డి తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూనే వచ్చారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు. హుజుర్నగర్లో గెలిచిన సైదిరెడ్డి రికార్ట్ను బ్రేక్ చేశారు. ఇప్పటి వరకు ఇక్కడ 29,194 ఓట్ల మెజార్టీతో గెలవగా నేడు సైదిరెడ్డి 43,624 ఓట్ల మెజార్టీతో గెలిచారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.