తెలంగాణ

కొడుకా రా.. కుర్చీ వేసిన!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 9: కొడుకా రా.. కుర్చీ వేశాను. నువ్వు ఆటంబాంబువైతే, మేము కాంగ్రెస్ చిచ్చర పిడుగులం.. అంటూ ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సిఎం కెసిఆర్‌పై విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీఎస్ ప్రాజెక్టు ఆనకట్ట పెంచాలంటూ కాంగ్రెస్ పార్టీ సోమవారం మహాదీక్ష నిర్వహించింది. దీక్షా శిబిరం నుంచి ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావుపైనా విరుచుకుపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు బేవకూఫ్‌లని సంభోదించారు. అయితే సిఎల్పీ నేత జానారెడ్డి తన ప్రసంగంలో మాత్రం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ వ్యాఖ్యలను వివాదంగా చూడవద్దని, ఆయన మాటలు రైతుల బాధలకు సంబంధించినవని చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదని రైతుల గుండెల్లో నుండి వచ్చిన బాధలాంటిదన్నారు. మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సైతం తాము కెసిఆర్‌ను మాత్రం తిట్టలేమని, ఆ మాటలు తనకు రావని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ తనదైన భాషలో మాట్లాడారని సమర్ధించారు. ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ సిఎం, మంత్రులపై చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. మహాదీక్ష ముగిసిన తర్వాత కొందరు కాంగ్రెస్ నాయకులే ఎమ్మెల్యే సంపత్‌కుమార్ చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవడం గమనార్హం. కాగా, మహాదీక్ష దగ్గరకు టిటిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి వచ్చి సంఘీభావం ప్రకటించి తన ప్రసంగంలో ముఖ్యమంత్రిపై చేసిన ఆరోపణలు రైతుల నుండి మంచి స్పందన లభించింది. అదేవిధంగా నాగం, రేవంత్‌రెడ్డిల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. మాజీ మంత్రి డికె అరుణ సైతం గతంలో ఆరీఎస్ ప్రాజెక్టుపై తాను చేపట్టిన ఉద్యమం గురించి గుర్తు చేస్తూ ఆనాటి సంఘటనలను యుద్ధంలాంటివని తెల్పడంతో అక్కడికి వచ్చిన వేలాది మంది రైతులు తమ చప్పట్లతో హర్షధ్వనులను వినిపించారు.