తెలంగాణ

కల్యాణం..రమణీయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 24: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామివారి తిరుకల్యాణోత్సవం, వైభవోత్సవ కల్యాణోత్సవాలు శనివారం వైష్ణవ పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారం సాంప్రదాయ బద్ధం గా వేద మంత్రోచ్ఛరణల మధ్య వైభవంగా నిర్వహించారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, జగత్ ద్రక్షుడైన లక్ష్మీనరసంహుడికి క్షీర సముద్ర తనయ లక్ష్మీ అమ్మవారితో జరిగిన కల్యాణోత్సవ ఘట్టాన్ని వీక్షించిన భక్తజనులు, గరుడుడి ఆహ్వానంతో యాదాద్రిపై వేంచేసిన సమస్త దేవతలు, సుర, మునులు పులకించారు. కల్యాణోత్సవంతో లక్ష్మీసమేతుడైన నరసింహుడు మహదానందంతో గజవాహనంపై విహరించి భక్తులకు దర్శనమిచ్చి తరింపచేశారు.
తొలుత కొండపైన బాల ఆలయంలో మధ్యాహ్నం నిర్వహించిన స్వామివారి తిరు కల్యాణోత్సవ వేడుకలో శ్రీరామాలంకార సేవను అర్చక పండితులు శాస్త్రానుసారం ఘనంగా నిర్వహించి హనుమత్‌వాహనంపై విహారింపచేశారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు నంధీగల్ నరసింహచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞికులు సముద్రాల శ్రీనివాసాచార్యుల బృందం స్వామివారి కల్యాణోత్సవాలను సాంప్రదాయ బద్ధంగా కొనసాగించారు. గజవాహనంపై ఆసీనులై మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య నారసింహుడు పెళ్లి మండపానికి తరలిరాగా, అమ్మవారు ముత్యాలపల్లకిలో మండపానికి చేరారు. స్వామివారి కల్యాణోత్సవానికి దేవస్థానం తరుపునా ఈవో గీత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి పట్టువస్త్రాలు, తలంబ్రాలు అందించారు. తిరు కల్యాణోత్సవంలో కలెక్టర్ అనితారామచంద్రన్, ధర్మకర్త బి.నరసింహమూర్తి, వైటిడిఏ చైర్మన్ జి.కిషన్‌రావు, భక్తులు, ఆలయ ఉద్యోగులు హాజరయ్యారు.
ఘనంగా వైభవోత్సవ కల్యాణం
ప్రధానాలయం పునర్ నిర్మాణం నేపధ్యలో స్వామివారి తిరు కల్యాణాన్ని కొండపైన బాల ఆలయంలో నిర్వహించిన అర్చక బృందం రాత్రి 8గంటలకు కొండ కింద జిల్లా పరిషత్ పాఠశాలలో వైభవోత్సవ కల్యాణం వేలాది మంది భక్తుల సమక్షంలో శాస్తయ్రుక్తంగా నిర్వహించారు. రంగురంగుల పూలతో, దేదీప్యమాన విద్యుత్‌దీపకాంతులతో అలంకరించిన పెళ్లి మండపంలో కొలువుతీర్చిన లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవ ఘట్టా న్ని ఆలయ ప్రధానార్చకులు నందీగల్ నరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు శ్రీనివాసాచార్యులు విష్వక్సేనారాధనతో ఆరంభించారు. పంచ పుణ్యనది జలాల అవాహన, మండప సంప్రోక్షణ, రక్షబంధనం, ద్వితీయ సువర్ణ యజ్ఞోపవీతధారణ, మదుపర్క నివేదన, నూతన పట్టువస్రాలంకరణ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున దేవాదాయ శాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు లక్ష్మీనరసింహుల కల్యాణోత్సవానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్‌రెడ్డి కల్యాణోత్సవానికి హాజరయ్యారు. తిరుమలేశుడి తరుపున టీటీడీ అర్చకులు డాలర్ శేషాద్రి, టీటీడీ అధికారులు పట్టువస్త్రాలను యాదాద్రి ఈవో గీత, ప్రధానార్చకులు నరసింహాచార్యులుకు అందించారు.
లక్ష్మీదేవి తండ్రియైన సముద్రుడు పాదప్రక్షాళన చేసి కన్యదానం చేయగా, జీలకర్ర బెల్లం ధారణ పిదప వేద మంత్రోచ్ఛరణల మధ్య, భక్తుల గోవింద నామస్మరణల మధ్య స్వామివారు అమ్మవారికి మంగళసూత్రధారణ చేసే ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. కల్యాణోత్సవంలో స్వామి, అమ్మవార్ల ఔన్నత్యాలతో కూడిన విశేషాలను, కల్యాణ ఘట్టాల ప్రాధాన్యతలను యాజ్ఞీకులు భక్తులకు వివరిస్తు కల్యాణోత్సవాన్ని ఆధ్యంతం రవవత్తరంగా రమణీయంగా నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహులకు ముత్యాల తలంబ్రధారణ చేసి బ్రహ్మోముడులు వేసి మంగళనీరాజనలు, ఆశీర్వఛనాలు అందించాకా గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చిన స్వామిఅమ్మవార్లను ఆలయానికి చేర్చారు. కల్యాణోత్సవాల్లో ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
చిత్రం..స్వామివారి కల్యాణం నిర్వహిస్త్తున్న దృశ్యం