తెలంగాణ

గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 12: తెలంగాణ రాష్ట్ర ఉభయ సభల బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ చేసిన ప్రసంగం అబద్దాల పుట్ట అని బిజెపి శాసనసభా పక్ష నేత జి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఉప నాయకుడు చింతల రామచంద్రారెడ్డిలు వ్యాఖ్యానించారు. బీజేఎల్‌పిలో వారు పాత్రికేయులతో మాట్లాడుతూ గవర్నర్ తన ప్రసంగంలో యువతకు ఉద్యోగాల ప్రస్తావన చేయలేదని, రెండు బెడ్‌రూమ్‌ల ఇళ్ల గురించి మాట్లాడలేదని, ఎస్సీ, ఎస్టీలకు మూడు ఎకరాల భూమి పంపిణీ అంశాన్ని కూడా ప్రస్తావించలేదని, అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడిన టిఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో దోషిగా నిలుపుతామని అన్నారు. గవర్నర్ తన ప్రసంగంలో కౌలు రైతుల అంశాన్ని కూడా ప్రస్తావించలేదని, తప్పుల తడకగా, గవర్నర్ ప్రసంగం అబద్దాల పుట్టగా ఉందని ఆరోపించారు. ఆ ప్రసంగాన్ని వినలేకనే తాము సభ నుండి వాకౌట్ చేశామని లక్ష్మణ్ పేర్కొన్నారు. శాసనసభా పద్ధతులను గౌరవించి వౌనంగా సభ నుండి వెళ్లిపోయామని చెప్పారు.