తెలంగాణ

ఏమీ చేయడం లేదన్నట్టు మాట్లాడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 20: రాష్ట్రప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్టు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మంగళవారం నాడు ఆయన శాసనసభలో మాట్లాడుతూ కొంత మంది సూచనలు సలహాలు ఇస్తే మరికొంత మంది మాత్రం రాజకీయంగానూ, ద్వేషంతోనూ మాట్లాడుతున్నట్టు కనిపించిందని అన్నారు. గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చాలా విషయాలకు వివరణ ఇచ్చారని, అయినా కొంత మం ది భిన్నంగా మాట్లాడారని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం సైతం రాష్ట్రం అమలుచేస్తున్న పథకాలను చూసి అభినందించకుండా ఉండలేకపోతోందని చెప్పారు. అందరూ చాలా గొప్పగా మాట్లాడుతుంటే విపక్షాలకు మాత్రం రాష్ట్ర అభివృద్ధి కనిపించకపోవడం శోఛనీయమని అన్నారు. ప్రభు త్వం తప్పు చేస్తే చెప్పవచ్చని, ప్రజల పక్షాల నిలబడి వారికి సాయం చేయవచ్చని, కానీ ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదన్నట్టు మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. తమ పార్టీ నేతలు బయట ఏం మాట్లాడున్నారో అదే శాసనసభలోనూ మాట్లాడే సంస్కారం తమకు ఉందని పేర్కొన్నారు.