తెలంగాణ

మహాసభల్లో ప్రభుత్వాల తీరును ఎండగడతాం: తమ్మినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 24: వచ్చే నెల 18 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్న సీపీఎం అఖిల భారత మహాసభల్లో టీఆర్‌ఎస్, బిజేపీ విధానాలను ఎండగడతామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మహా సభల నేపథ్యంలో శనివారం ఆయన పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ గ్రాఫ్ పడిపోతున్నదని అన్నారు. నాలుగేళ్ల పాలనలో పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టి, ధరల పెరుగుదల, మతోన్మాద చర్యలు, దళితులు, మైనారిటీలపై వివ క్ష, అణచివేత తదితర ఘటనలతో ప్రజలు విసిగిపోతాయరని ఆయన చె ప్పారు. మరోవైపు ఎన్డీఎలో మొన్నటి వరకూ భాగస్వాములుగా ఉన్న టిడిపిలాంటి ప్రధాన పార్టీ బయటకు వచ్చేసిందని అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్లమెంటులో మెజారిటీ సభ్యులు బిజెపికి చెందిన వారుగా ఉన్నప్టటికీ, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొవడానికి ఆ పార్టీ భయపడుతున్నదని తమ్మినేని తెలిపారు.