తెలంగాణ

నిరసన సజావుగా సాగేలా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: భారత్ బంద్ సందర్భంగా పోలీస్ కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందడాన్ని నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమం సజావుగా సాగేలా చూడాలని డీజీపీ మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ హనుమంతరావు లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో సైతం నిరసన చేస్తున్నట్టు లేఖలో వివరించారు. మృతిచెందిన కుటుంబాలకు సంఘీభావంగా తమ పార్టీ కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతారని అన్నారు. శాంతియుతంగా నిర్వహిస్తున్నందున పోలీసులు ముందస్తు అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేయకుండా సజావుగా సాగేలా చూడాలని కోరారు.