తెలంగాణ

చెరువులో విష ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఏప్రిల్ 10: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఉండం గ్రామ చెరువులో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు విష ప్రయోగం జరిపిన సంఘటనలో ఏడు టన్నుల చేపలు మృత్యువాత పడ్డాయి. గత జూలై మాసంలో ఉండం చెరువులో మత్స్యకారుల ఉపాధి కోసం ప్రభుత్వం 2.5 లక్షల చేప పిల్లలను వదిలిపెట్టగా అవి వృద్ధి చెంది విక్రయానికి సిద్ధంగా ఉన్న దశలోనే విష ప్రయోగం జరపడం అలజడి రేపింది. ఈ ఘటన గ్రామస్థులు జరిపారా? లేక కక్ష సాధింపుతోనే ఒక వర్గం చెరువులో విషం కలిపిందా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. బంగారు తీగ, రవాట, సొరచేప, మొట్టలు మృతి చెంది చెరువు తీరంలోకి కొట్టుకురావడం దిగ్భ్రాంతికి గురిచేసింది.

చిత్రం..చెరువులో మృతి చెందిన చేపలు