తెలంగాణ

మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: బీజేపీ ఎమ్మెల్యే ఠాకూర్ రాజాసింగ్‌పై జరిగిన దాడిపై విచారణ జరిపి హిందూ నేతలను హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్న మతోన్మాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హిందూ జనజాగృతి సమితి సమన్వయకర్త చేతన్‌గాడి డిమాండ్ చేశారు.
ఇంతవరకూ కేరళ, తమిళనాడు, కర్నాటక, బెంగాల్‌కు మాత్రమే పరిమితమైన ఈ కుట్రలు ఇప్పుడు మహారాష్టల్రో కూడా జరగడం దారుణమని అన్నారు. గతంలో హిందూ జన జాగృతి నిర్వహించిన హిందూ ధర్మ జాగృతి సభల్లో కూడా రాజాసింగ్‌కు బెదిరింపులు వచ్చాయని, ఈ బెదిరింపులకు భయపడకుండా సభలకు వచ్చి రాజాసింగ్ మార్గదర్శనం చేశారని అన్నారు. సభ ముగించుకుని వస్తున్నపుడు వాహనాన్ని ప్రమాదానికి గురిచేసి ఆయనను హత్య చేసేందుకు కుట్ర పన్నారని, దానిని ఒక ప్రమాదంగా చూడకుండా ప్రభుత్వం లోతైన విచారణ జరిపించాలని చేతన్ డిమాండ్ చేశారు. జన జాగృతి సమితి 7, 8 తేదీల్లో మాలేగావ్, బిడ్‌లలో నిర్వహించిన హిందూ ధర్మ జాగృతి సభలకు వెళ్లవద్దని కనీసం 200కు పైగా బెదిరింపు కాల్స్ వచ్చాయని రాజాసింగ్ వాహనంపై యాక్సిడెంట్ చేయడానికి ఉపయోగించిన కంటైనర్ యజమానులు, డ్రైవర్ ఇద్దరూ మతోన్మాదులు కావడం సంఘటన గాంభీర్యతను పెంచుతోందని అన్నారు.