తెలంగాణ

జగదీశ్వర్‌రెడ్డి అవినీతిపై లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అవినీతి బాగోతంపై సివిసి, లోకాయుక్తకు ఫిర్యాదు చేస్తామని టి.పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ దాసోజు శ్రవణ్ తెలిపారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించేందుకు భయం ఎందుకని ఆయన సోమవారం విలేఖరుల సమావేశంలో ప్రశ్నించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు ప్రభుత్వానికి కట్టబెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. అవినీతి గురించి తాము అన్ని ఆధారాలు బయట పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని దాచాలని చూస్తున్నదన్న అనుమానం కలుగుతున్నదని అన్నారు. అన్ని అంశాలపై ట్విట్టర్‌లో స్పందించే మంత్రి కే. తారక రామారావు తన సహచర మంత్రి జగదీశ్వర్ రెడ్డిపై వచ్చిన అవినీతి, ఆరోపణలపై ఎందుకు స్పందించలేదని దాసోజు ప్రశ్నించారు.