తెలంగాణ

రైతులకు సంకెళ్లు వేసినా, ధర్నా చౌక్ తొలగించినా స్పందించరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 24: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంకేళ్లు వేసినా, ధర్నా చౌక్ ఎత్తివేసినా గవర్నర్ నరసింహన్ పట్టించుకోవడం లేదని ఏఐసీసీ నాయకుడు, మాజీ ఎంపీ వి. హనుమంత రావు విమర్శించారు. గవర్నర్ మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. కర్నాటక లో బీజేపీకి వ్యతిరేకంగా టీడీపీ పనిచేస్తున్నందున, ఆ విధంగా చేయరాదని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరేందుకు గవర్నర్ వెళ్లారని ఆయన ఉదహరించారు. కర్నాటకలో ఎవ రు ఎన్ని కుట్రలు చేసినా సిద్దరామయ్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 29న ఢిల్లీలో జరిగే జన ఆక్రోష్ సభకు దేశ వ్యాప్తంగా అన్ని వర్గాలు ప్రజలు రావాలని ఆయన కోరారు.