తెలంగాణ

మిషన్ భగీరథ పనులపై ఉన్నతస్థాయి సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 18: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌భగీరత పథకాన్ని యుద్ధప్రాతిపధికన పూర్తి చేసి, గ్రామీణ ప్రజలకు పూర్తిస్థాయిలో మంచినీటి సౌక్యం కల్పించాలని గ్రామీణ మంచినీటి సరఫరా పథకం ఇంజనీరింగ్ అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి ఆదేశించారు. శుక్రవారం నాడు సచివాలయంలో మిషన్‌భగీరత పనుల తీరుపై జిల్లాల ఎస్‌ఇ,సిఈలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. రోజూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అభివృద్ధి పనులపై ఆరా తీస్తున్నారని అధికారుల దృష్టకి తీసుకువచ్చారు. ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీటిని అందించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓహెచ్‌ఎస్‌ఆర్ నిర్మాణాలకు అవసరమైన స్థలాలను ఎంపిక ప్రక్రియను సత్వరం పూర్తి చేసి 100 శాతం గ్రౌండింగ్ చేయాలన్నారు.