తెలంగాణ

ఉప ఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని మోదీ పతనానికి నాంది అని మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కేవలం ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే స్థానాలను మాత్రమే బీజేపీ గెలుచుకోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న మహారాష్టల్రో ఘోర పరాజయం పాలైందని వివరించారు. మేఘాలయాలో బీజేపీ చేసిన అప్రజాస్వామిక విధానాలకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కైరానా ఎంపీ స్థానం విషయంలో ఆర్‌ఎల్డీ విజయం బీజేపీ వ్యతిరేకశక్తుల కలయికతో సాధ్యం అయిందని పేర్కొన్నారు. రాబోయే సాధారణ ఎన్నికలకు ఇది నాంది అని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు ప్రారంభం అయి కొనసాగుతున్నాయన్నారు. 2019లో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో విజయం సాధించి ప్రజలకు మెరుగైన పాలన అందిస్తుందని తెలిపారు.