తెలంగాణ

మోదీ ప్రభుత్వం పేదల పక్షపాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 1: నాలుగేళ్ల పాలనలో చిన్నపాటి అవినీతి, అక్రమాలు లేకుండా ఎంతో పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తూ పోతున్నారని, దేశంలో 21 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉందంటే దానికి మోదీ అవినీతి రహిత పాలనే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అన్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలుచేసిందని చెప్పారు. పేదరికంలో పుట్టి స్వయంగా పేదరికాన్ని అనుభవించిన వ్యక్తిగా ప్రధాని నరేంద్రమోదీ పేదల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. తన తల్లి వంటింట్లో పడ్డ కష్టాలు చూసిన మోదీ ఏ తల్లికీ అలాంటి కష్టం రాకూడదన్న ఉద్ధేశ్యంతో దేశంలో 8 కోట్ల మంది పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారని, తెలంగాణలో 20 లక్షల మందికి ఉచిత గ్యాస్ పంపిణీ చేపట్టారని అన్నారు. తాను అనుభవించిన కష్టాలు వరూ అనుభవించకూడదని, ప్రధాన మంత్రిగా బాధ్యత చేపట్టిన నాడే మోదీ స్పష్టం చేశారని అన్నారు.