తెలంగాణ

ప్రజల జీవితాలు నెల వంకలా సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 10: ఈద్ నెలవంకలా ప్రజల జీవితాలు అందంగా సాగాలని గవర్నర్ నరసింహన్ ఆకాంక్షించారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని ఆదివారం రాజ్‌భవన్‌లో ఇఫ్తార్ విందును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఎంపీలు మల్లారెడ్డి, వినోద్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రంజాన్ సోదర భావాన్ని, ప్రేమ తత్వాన్ని పెంపొందిస్తోందన్నారు. రంజాన్ అనంతరం సైతం ఇదే కొనసాగాలని కోరారు. అనంతరం మత పెద్దల ప్రార్ధనల అనంతరం ముస్లిం సోదరులచే ఉపవాస దీక్ష విరమింప చేసి విందును కొనసాగించారు.

చిత్రం..రాజ్‌భవన్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఇఫ్తార్ విందులో గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ తదితరులు