తెలంగాణ

ప్రశాంతంగా బార్ కౌన్సిల్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 29: హైకోర్టు బార్ కౌన్సిల్‌కు జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ జరిగిందని హైకోర్టు బార్ కౌన్సిల్ సెక్రటరీ రేణుక తెలిపారు. శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో బార్ కౌన్సిల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఆమె తెలిపారు. పోలింగ్ సందర్భంగా సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు జిల్లా న్యాయాధికారుల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహణ చేపట్టారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కౌంటింగ్ జూలై 11న, 23న తెలంగాణ బార్ కౌన్సిల్ కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో దాదాపు 1800 మంది న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైకోర్టు బార్ కౌన్సిల్‌కు ఎన్నికైన సభ్యులు జూలై 23 తర్వాత బార్ కౌన్సిల్ చైర్మన్ ఎన్నుకుంటారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో 25 మందిని బార్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నిక అవుతారు.