తెలంగాణ

చరిత్రను భావితరాలకు అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 10: మన చరిత్రను భద్రపరచుకోవాలని, దానిని భావితరాలకు అందించాలని అందుకు రికార్డులను పదిలపరచుకోవాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఇండియన్ హిస్టారికల్ రికార్డ్సు కమిటీ 62వ జాతీయ సదస్సును మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఉప ముఖ్యమంత్రి, విద్యామంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రికార్డులు లేకండా చరిత్ర లేదని, ఇంతటి ముఖ్యమైన రికార్డులను డిజిటలైజ్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ ప్రాచ్య లిఖిత సంస్థ ప్రపంచంలోని పది ప్రాచ్యలిఖిత సంస్థల్లో ఒకటి కావడం గర్వకారణమని అన్నారు. మన ప్రాచ్య లిఖిత సంస్థలో దాదాపు వివిధ రాజ వంశీయులకు చెందిన అనేక రికార్డులు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఇంతటి విలువైన రికార్డులున్న తెలంగాణ ప్రాచ్య లిఖిత సంస్థను పూర్తిగా డిజిటలైజ్ చేస్తామని, హైదరాబాద్ ఐటి కేంద్రంగా ఉందని, ఇలాంటి ఐటి కేంద్రంలో చరిత్రకు సంబంధించిన రికార్డులను డిజిటలైజ్ చేయకపోతే బావుండదని అన్నారు వెంటనే కేంద్ర ప్రాచ్య లిఖిత సంస్థ అధికారులు తెలంగాణ ఆర్కైవ్స్ లోని రికార్డులు అన్నింటినీ డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. అందుకు అయ్యే ఖర్చుకు వెనుకాడరాదని , ఆ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. హైదరాబాద్ చారిత్రక నగరమని, ఇండియన్ హిస్టారికల్ రికార్ట్సు కమిటీ 62వ జాతీయ సదస్సు ఇక్కడ జరగడం విశేషమని అన్నారు. అదే విధంగా ఇంతటి చారిత్రక నగరం దేశంలోనే అత్యంత పిన్న వయస్సున్న తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని చమత్కరించారు. హైదరాబాద్ నగరం బిర్యానీకి ప్రసిద్ధమని, దేశవ్యాప్తంగా ఉన్న చరిత్రకారులు ఈ సదస్సుకు వచ్చారని, వీరంతా హైదరాబాద్ బిర్యానీ రుచి చూసి, ఇక్కడి ఆతిథ్యాన్ని స్వీకరించాలని కోరారు. ఈ సమావేశంలో మొఘల్ రికార్డ్సు కేటలాగ్ 116, పార్టు-2 ఇతిహాస్ వాల్యూమ్ 2ను ఉప ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఆర్కైవ్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్, కేంద్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి రాఘవేంద్రసింగ్ , నేషనల్ ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ ప్రీతం సింగ్, మర్రి చెన్నారెడ్డి మావన వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య, రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆకునూరి మురళీ, రాష్ట్ర ఆర్కైవ్స్ డైరెక్టర్ జరీనా పర్వీన్ ఇతర అధికార్లు పాల్గొన్నారు.

చిత్రం..హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో మంగళవారం ఇండియన్ హిస్టారికల్ రికార్డ్స్ కమిటీ 62వ జాతీయ సదస్సును ప్రారంభిస్తున్న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి