తెలంగాణ

సాకులు చూపి పంచాయతీ ఎన్నికల నిర్వహణలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 13: రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సాకులను అడ్డు పెట్టుకుని పంచాయతీ ఎన్నికలను నిర్వహించకుండా జాప్యం చేస్తున్నదని టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై లోగడ పలు పర్యాయాలు చర్చకు వచ్చిందని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ గుర్తు చేవారు. అయితే రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన చెప్పారు. ఒబీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో అన్యాయం జరిగేలా ప్రభుత్వం కుట్ర చేసిందని ఆయన విమర్శించారు. ఒబీసీలకు సరైన గణన చేయమని కోర్టు ఆదేశించిందని ఆయన చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే గణాంకాలను ఎందుకు బయట పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన సర్వేను బయట పెట్టాలని భట్టి డిమాండ్ చేశారు.