తెలంగాణ

సమస్యలు పరిష్కరించని సర్కారు: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: తెలంగాణ ప్రభుత్వం అంతా కంప్యూటర్ గ్రాఫిక్స్ మాయ చేస్తోందని, సమస్యలు ఎక్కడివక్కడ యథాతథంగా ఉన్నాయని బీజేపీ నేతలు శుక్రవారం నాడు ఎద్దేవా చేశారు. బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి కిషన్‌రెడ్డి, ఉప నేత ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రామచందర్‌రావులు పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జిల్లా సమీక్షలు లేవని, హైదరాబాద్ అభివృద్ధి కోసం బీజేపీ ఎమ్మెల్యేలు అంతా సచివాలయం గేటు వద్ద ధర్నా చేస్తే సీఎం మీటింగ్ నిర్వహించి ఒక్క హామీ నిర్వహించలేదని ఆరోపించారు. అభివృద్ధి నివేదికల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నారని హైదరాబాద్‌లో ఒక్క గల్లీలోనూ గుంతలు పూడ్చలేదని అన్నారు. మజ్లీస్ ఎమ్మెల్యేల ప్రాంతాల్లో మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని, ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయో చెప్పలేదని విమర్శించారు.