తెలంగాణ

మోదీ పాలనలో ఎన్నో ఘనతలు: లక్ష్మణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 27: నాలుగేళ్ల పాలనలో ప్రధాని నరేంద్రమోదీ ఎన్నో ఘనతలను సాధించారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న డాక్టర్ లక్ష్మణ్ గురువారం నాడు టెక్నాస్‌లో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస తెలంగాణ వాసులను ఉద్ధేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాధించిన అనేక విజయాలను వివరించారు. గత ప్రభుత్వాలు గుర్తించని అంశాలపై దృష్టి పెడుతూ పేదలు, సంపన్నులు అనే వ్యత్యాసం లేకుండా అందరూ అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో మోదీ పాలన కొనసాగుతోందని అన్నారు. మోదీ పాలనపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, ప్రతిపక్షాలు చులకనా మాట్లాడుతూ ఇంటింటికీ మరుగుదొడ్డి కార్యక్రమాన్ని సవాలుగా తీసుకుని మహిళల ఆత్మగౌరవాన్ని నిలిపారని అన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక అన్ని గ్రామాలకూ విద్యుత్ సౌకర్యం కల్పించడమైందని, బ్యాంకింగ్ వ్యవస్థను జన్‌థన్ పథకంతో పేదలకు చేరువ అయందని అన్నారు.