తెలంగాణ

కేరళకు సురవరం మనుమరాళ్ల సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: వరదలతో చిన్నభిన్నం అయిన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మనవరాళ్లు ముందుకు వచ్చారు. ప్రకృతి అందాలకు నెలవైన కేరళ వర్షాలతో అల్లాడి పోవడం ఆ చిన్నారులను ఎంతగానో కలిచి వేసింది. అందరిలా కాకుండా వెంటనే తాము కూడా ఎంతో కొంత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా తాము దాచుకున్న 2,080, పలువురి వద్ద రూ.13,500 వసూలు చేశారు. అంతేకాకుండా నగరానికి చెందిన వైద్యుడు సోహన్ సింగ్ వద్దకు వెల్లి మీ వంతుగా ఏం ఇస్తారని చిన్నారులు అడగటంతో లక్ష రూపాయాల చెక్కును అందించాడు. ఈ మొత్తాన్ని శుక్రవారం చిన్నారులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డికి అందజేసి, తాతకు తగ్గ మనవరాళ్లు అని అనిపించుకున్నారు.