తెలంగాణ

జీవో 550పై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: రాష్ట్ర ప్రభుత్వం 2018-19 విద్యా సంవత్సరం మెడికల్ కౌన్సిలింగ్‌లో 550 జివోను అమలు చేయడంలో జరిగిన తప్పిదాలపై తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి, ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం జరగాలంటే ఇప్పటి వరకు నిర్వహించిన అడ్మిషన్లలో సీట్లు రాని వారి కోసం (మోప్-అప్-రౌండ్) మళ్లీ కౌనె్సలింగ్ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు. మోప్-అప్-రౌండ్‌లోనైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. జివో 550 అమలు కానందున సుమారు 300 మంది రిజర్వేషన్ అభ్యర్ధులు నష్టపోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకూ 550(2)ను అనుసరించి నష్టపోయిన వారందరికీ రానున్న కౌన్సిలింగ్‌లోనైనా లేదా సూపర్‌న్యూమరీ సీట్లు క్రియేట్ చేసి అడ్మిషన్లు ఇచ్చి న్యాయం చేయాలని డాక్టర్ శ్రవణ్ కోరారు.