తెలంగాణ

పోలీసుల ఎదుట రాజాసింగ్ హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తిరంగ ర్యాలీ నిర్వహించినందుకు నోటీసులు అందుకున్న గోషామహల్ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నాడు అబిడ్స్ పోలీసుల ముందు హాజరై తన వివరణ లిఖితపూర్వకంగా అందజేశారు. విపక్ష పార్టీలకు చెందిన నాయకుల పరువు తీయడానికి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. స్వాతంత్య్రదినోత్సవం రోజున తాను తిరంగ యాత్రలో ముఖ్య అతిథిగా పాల్గొన్నానని, వాస్తవానికి ఆ యాత్రను తాను నిర్వహించలేదని చెప్పారు. అయితే సాంకేతికంగా ఇచ్చిన నోటీసుకు తాను చట్టబద్ధుడినై వివరణ ఇచ్చినట్టు తెలిపారు.