తెలంగాణ

హత్యా రాజకీయాల్లో వైఎస్ కుటుంబీకులు సిద్ధహస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 28: హత్యా రాజకీయాలు చేయడంలో వైఎస్ కుటుంబీకులు సిద్ధహస్తులని పాయకరావుపేట టీడీపీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఆరోపించారు శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్టచర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. ప్రతిపక్షం మాత్రం రాష్టవ్య్రాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తుందన్న విషయం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే తేటతెల్లమవుతుందని చెప్పారు. శాంతిభద్రతలను పరిరక్షించేందుకు, నేరాలను తగ్గించేందుకు రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వం సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పాటు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోందన్నారు.