తెలంగాణ

‘రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న కెసిఆర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కెసిఆర్ కుట్ర పన్నారని టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అభినందన దినోత్సవంగా జూన్ 2ను జరుపుతున్నామన్నారు. సోనియా వల్లనే తెలంగాణ రాష్ట్రం అవతరించిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఒక భ్రమని, ఈ స్కీంకు నిధులు లేవన్నారు. కేజి నుంచి పిజి ఉచిత విద్య, భూ పంపిణీ లాంటి స్కీంలను ఆడంబరంగా ప్రకటించి అమలు చేయడం లేదన్నారు. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేస్తున్నామన్న కెసిఆర్ మాటల్లో నిజం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 95 శాతం పూర్తయినా సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయలేదన్నారు. మిషన్ భగీరథ, కాకతీయ, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించారని, టెండర్లలో అవకతవకలకు పాల్పడుతున్నారన్నారు.