తెలంగాణ

టీజేఎస్‌లోకి విశ్రాంత న్యాయమూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 13: తెలంగాణ జన సమితి (టీజేఎస్)లో విశ్రాంత న్యాయమూర్తి రవీందర్ రెడ్డి శనివారం చేరారు. టీజేఎస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం. కోదండరామ్ ఆయనకు పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. రవీందర్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు. రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో 1600 మంది అమరులయ్యారని అన్నారు. ఏ ఒక్కరి వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, సమష్టి కృషి, పోరాటాల ఫలితంగా వచ్చిందన్నారు. మిలియన్ మార్చ్, సాగర హారం వంటివి చేపట్టడం జరిగిందని ఆయన ఉదహరించారు. రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతున్నదని ఆయన విమర్శించారు. అవినీతి నిర్మూలన జరగాలంటే ప్రొఫెసర్ కోదండరామ్ పాలన రావాలన్నారు.

చిత్రం..టీజేఎస్‌లో చేరుతున్న న్యాయమూర్తి రవీందర్‌రెడ్డికి స్వాగతం పలుకుతున్న కోదండరామ్