తెలంగాణ

దత్తాత్రేయ లేఖకు వెంటనే స్పందించిన కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంట్ సభ్యుడు బండారు దత్తాత్రేయ కోరారు. కేంద్ర విద్యుత్ శాఖ సహాయ మంత్రి (స్వయం ప్రతిపత్తి) ఆర్‌కే సింగ్‌కు ఆదివారం ఆయన ఒక లేఖరాశారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం-వార్దా తదితర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు. దత్తాత్రేయ లేఖకు కేంద్రం వెంటనే స్పందించింది. కోలార్‌లైన్‌ను వెంటనే పునరుద్ధరిస్తామని, శ్రీకాకుళం-వార్దా-బలార్షా లైన్ సామర్ధ్యాన్ని పెంచి విద్యుత్ సరఫరా చేస్తామని కేంద్రం విద్యుత్ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినట్టు దత్తాత్రేయ ఒక ప్రకటనలో తెలిపారు.