తెలంగాణ

అందరి సంక్షేమమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 14: తెలంగాణ రాష్ట్ర సమితికి, మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగత అభిమాని అయిన ఆంధ్ర ప్రాంతానికి చెందిన రోహిత్‌రెడ్డి అనే యువకుడు పాదయాత్ర ద్వారా ఆదివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. 17 రోజుల కిందట విజయవాడ నుంచి కాలినడకన బయలుదేరిన రోహిత్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా వాసి. హైదరాబాద్‌కు చేరుకున్న ఈ యువకుడిని టీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ బేగంపేటలో మంత్రి కేటీఆర్ క్యాంపు కార్యాలయానికి తీసుకవచ్చి మంత్రికి పరిచయం చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితిడిని అయినట్టు రోహిత్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. టీఆర్‌ఎస్‌తో పాటు తాను మంత్రి కేటీఆర్‌కు వ్యక్తిగతంగా వీరాభిమానని చెప్పారు. తన ఎదపై కేటీఆర్ ఫోటోను టాటూగా వేయించుకున్నది రోహిత్‌రెడ్డి చూపించారు. యువతరానికి స్ఫూర్తినిచ్చేలా విధంగా మంత్రి కేటీఆర్ రాజకీయ రంగంలో రాణిస్తున్నారని కొనియాడారు. తనపట్ల అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ చార్మినార్ బొమ్మ కలిగిన జ్ఞాపికను రోహిత్‌రెడ్డికి మం త్రి కేటీఆర్ అందజేసారు. వచ్చే ఎన్నికల్లో కూడా తిరిగి టీఆర్‌ఎస్స్‌నే గెలిపించాలని తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానని రోహిత్‌రెడ్డి కోర గా మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు.

చిత్రం..అభిమానిని అభినందిస్తున్న కేటీఆర్