తెలంగాణ

మాజీ మంత్రి మల్యాల కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: టీడీపీ నేత, మాజీ మంత్రి మల్యాల రాజయ్య సోమవారం కన్నుమూశారు. కొంత కాలం క్రితం రాజయ్య అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను సికింద్రాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్చించారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నాడు ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజయ్య టీడీపీలో చేరారు. 1985 సంవత్సరంలో అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో రాజయ్య ఆందోల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి డి. రాజనర్సింహపై విజయం సాధించారు. 1994 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కూడా విజయం సాధించారు. ఎన్టీఆర్ ఆయన్ను తన మంత్రివర్గంలోకి తీసుకుని గృహా నిర్మాణ, ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు అప్పగించారు. 1997లో సిద్దిపేట ఎంపీగా విజయం సాధించారు.