తెలంగాణ

సన్నబియ్యం సేకరణకు రెండువేల కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 15: రాష్ట్రంలో హాస్టళ్లకు అవసరమైన సన్నబియ్యం సేకరించేందుకు పౌరసరఫరాల శాఖ రెండువేలకోట్ల రూపాయలను బ్యాంకుల నుంచి రుణంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రైతుల నుంచి వరిధాన్యం సేకరించేందుకు ఇప్పటికే ఆరువేల కోట్ల రూపాయల రుణాన్ని బ్యాంకుల నుంచి తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖకు అనుమతించిన ప్రభుత్వం ఇప్పుడు హాస్టళ్ల విద్యార్థుల అవసరాలకోసం సన్నబియ్యం సేకరణకు మరో రెండువేల కోట్ల రూపాయలు రుణంగా తీసుకునేందుకు అనుమతించింది.
బ్యాంకుల నుంచి రుణం తీసుకునేందుకు గ్యారంటీ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు సోమవారం ఒక జీఓ జారీ అయింది. పౌరసరఫరాల శాఖ కమిషనర్, ఎక్స్-అఫీషియో కార్యదర్శి డాక్టర్ అకున్ సబర్వాల్ పేరుతో జీఓ జారీ అయింది.