తెలంగాణ

ముందస్తులో మాకూ ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: ముందస్తు ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్‌కు ప్రాధాన్యతనిచ్చి అధిక సీట్లు కేటాయించాలని మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేసింది. గాంధీ భవన్‌లో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ళ శారద అధ్యక్షతన సోమవారం మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జనెట్ డిసౌజా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనెట్ డిసౌజా ప్రసంగిస్తూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పడుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ విజయానికి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని, ముఖ్య భూమిక పోషించాలని సూచించారు. నేరెళ్ళ శారద, పలువురు మహిళా నాయకులు ప్రసంగిస్తూ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని డిమాండ్ చేశారు.