తెలంగాణ

రెండు కూటములనూ.. ఓడించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ, అక్టోబర్ 23: తెలంగాణ రాష్ట్రంలో రెండు కుటమూలను తెలంగాణ రాష్ట్రప్రజలు ఓటు ఆయుధంతో పెకిలించాలని బీజేపీ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ధన్వాడ మండల కేంద్రంలో బీజేపీ అధ్వర్యంలో నారాయణపేట నియోజకవర్గం బూత్‌స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన తెరాస, ఎంఐఎం కూటమి, కాంగ్రెస్ మహాకూటములను జరగబోయే ఎన్నికల్లో ఓటు ఆయుధం ద్వారా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. నారాయణపేట నియోజకవర్గం బీజేపీ నుంచి రతంగ్ పాండురెడ్డిని గెలిపిస్తే నారాయణపేటకు మంత్రి పదవిని కేటాయించడం జరుగుతుందని ఆయన సభలో కార్యకర్తలకు తెలిపారు. దేశప్రధాని నరేంద్రమోదీ పాలనలో అవినీతిని అంతం చేయడం జరిగిందన్నారు. గ్రామాలు అభివృద్ధి జరగాలన్నా బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం వివిధ మండలలనుండి వచ్చిన వివిధ పార్టీల నాయకులు కిషన్‌రెడ్డి అధ్వర్యంలో బీజేపీలో భారీ సంఖ్యలో చేరారు. అనంతరం ధన్వాడ మండలం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో కిషన్‌రెడ్డిని పూలమాలలతో,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో బీజేపీ రాష్టన్రాయకులు నాగురావునామాజీ, శాంతికుమార్, జిల్లా అధ్యక్షురాలు పద్మజారెడ్డి,పేట బీజేపీ పార్టీ అభ్యర్థీ రతంగ్‌పాండురెడ్డి,నారాకోండయ్య, తిరుపతయ్య, ప్రభాకర్‌వర్థన్,రాంచంద్రయ్య,గోవర్థన్‌గౌడ్, ఉమేష్‌కుమార్, మల్లయ్య, ధన్వాడ మండల బీజేపీ అధ్యక్షులు మాకం సురేంధర్, రఘువీర్‌యాదవ్, రమేష్, రాజేష్‌కుమార్, అంజియాదవ్ , వెంకటేష్ , రాఘవేంద్రగౌడ్, గోపిగౌడ్ పాల్గొన్నారు.