తెలంగాణ

టీఆర్‌ఎస్‌ను తన్నితరమండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 24: అధికారం చేపట్టిన నాలుగున్నరేళ్లలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి మరోసారి గ్రామాల్లోకి వస్తున్న టీఆర్‌ఎస్‌ను తన్నితరమాలని టీపీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. బుధవారం కరీంనగరంలోని టీడీపీ జిల్లా శాఖ క్యాంప్ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి జోజిరెడ్డితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నిధులు, నీళ్లు, నియామకాల ఆకాంక్షను నెరవేర్చుతామని అధికారంలోకి వచ్చిన తెరాస సర్కార్ ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయిందన్నారు. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబ, నియంత రాచరిక పాలనకు చరమగీతం పాడేందుకు కూటమి ఏర్పడిందన్నారు. మహాకూటమి ఏర్పాటుతో కేసీఆర్, కేటీఆర్ లాగులు తడుపుకుంటున్నారని వారి మాటల్లోనే తేటతెల్లమవుతుందన్నారు. కొడంగల్ సభ తరువాత కేసీఆర్ గ్రాఫ్ రోజురోజుకూ తగ్గుతూ వస్తుందని తెలిపారు. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లు అందివ్వకుంటే ఓట్లు అడగమని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రజల తగ్గరకొచ్చి ఓట్లడుతారని ఆయన ప్రశ్నించారు. తెరాస అభ్యర్థులు పల్లెల్లో ప్రజలను ఓట్లు అడగడానికి వస్తే ప్రజల నుంచి నిరసనలు, నిలదీతలు మొదలవుతున్నా నిసిగ్గుగా తెరాసకు ప్రజాదరణ ఉందని చెప్పుకోవడం కేసీఆర్, కేటీఆర్‌లకే చెల్లుతుందన్నారు. ఎంపీ సీట్లలో బీజేపీకి మద్దతు ఇవ్వమని చెప్పే ధైర్యం కేసీఆర్‌కు, కేటీఆర్‌లకు ఉందా..? అని పొన్నం ప్రశ్నించారు. ముస్లీంలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మాట తప్పినా ఎంఐఎం నోరు మెదపకపోవడం ముస్లీంలు గమనిస్తున్నారన్నారు. బీసీలకు, మైనార్టీలకు సబ్‌ఫ్లాన్ అధికారంలోకి వస్తే అమలు చేస్తామని, ఎస్సీ సబ్‌ఫ్లాన్ అమలు చేశామన్నారు. మహిళలకు 50శాతం మంత్రి వర్గంలో చోటు కల్పిస్తామన్నారు. కాంగ్రెస్ విశ్వసనీయత కలిగిన పార్టీ అని మెనిఫెస్టోలో పెట్టని అంశాలను అమలు చేశామన్నారు. కార్పోరేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ చేసింది ఏమిలేకపోగా కాంగ్రెస్ 60యేళ్లలో రూ. 60వేల కోట్లు అప్పు చేస్తే, తెరాస సర్కార్ నాలుగున్నరేళ్లలోనే రూ. 2లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశారన్నారు. తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తొమ్మిదిన్నర ఏళ్లలో అభివృద్ధి ఏమీ లేదని, తన సొంత వ్యాపారాలను పెంచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారని ఆరోపించారు.