తెలంగాణ

అధికారుల మనోస్థైర్యం దెబ్బతీయొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: తెలంగాణ పోలీసులు శాంతిభద్రతలో దేశానికే ఆదర్శంగా నిలువగా వారి మనస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు తీవ్రంగా స్పందించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని కేటీఆర్ హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీలను వేదింపులకు గురి చేస్తోన్న అధికారులపై చర్యలు తీసుకుంటామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌లో కేటీఆర్ స్పందించారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు రూ. 3 కోట్లు కారులో తరలిస్తూ పట్టుబడ్డారని గుర్తు చేశారు. ఆ సంఘటన నేపథ్యంలోనే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రస్తుతం ఉలిక్కి పడుతున్నట్టుగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఇలా ఉండగా అధికారులు తమను వేదిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు బొడకుంట్ల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ నేతలు చౌకబారు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.