తెలంగాణ

కూటమి దెబ్బకు టీఆర్‌ఎస్ ఓటమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: కేసీఆర్ కుటుంబం దోపిడీని ఆపేందుకే మహాకూటమి ఆవిర్భవించిందని టీటీడీపీ ప్రధానకార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఆశీర్వాద సభలను కేసీఆర్, కేటీఆర్‌లు కలిసి శాపనార్థాల సభలుగా మార్చినట్టుందని ఎద్దేవా చేశారు. 2004, 2009లో గడ్డాలు, కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్న కేసీఆర్ ఈసారి పొత్తులపై విడ్డూరమైన మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. 60 ఏళ్లలోజరిగిన దొపిడీని నాలుగేళ్లలో కేసీఆర్ కుటుంబం చేసి చూపిందని అన్నారు. ఓట్లు డబ్బాలో పడే నాటికి ఇంటింటికీ భగీరథ నీళ్లు అంటూ ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడుతున్న కేసీఆర్ తన తండ్రి ప్రగతి నివేదిన సభలో ఏం చెప్పారో గుర్తుచేసుకోవాలని అన్నారు. 22వేల గ్రామాలకు ఇప్పటికే నీళ్లిచ్చామని, మరో 8 రోజుల్లో 13 వందల గ్రామాలకు నీళ్లు ఇస్తామని చెప్పారని దానిపై వివరణ ఇవ్వాలని అన్నారు. ఆరు నెలల్లో కాళేశ్వరం పూర్తి చేస్తామని అంటున్నారని ఇదేం విడ్డూరమని అన్నారు.
పక్క రాష్ట్రం కరెంట్ ఇవ్వలేదని పదే పదే మాట్లాడుతున్నారని, పక్క రాష్ట్రం కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కమిషన్లు ఇవ్వడానికి నిరాకరించిందని గుర్తుచేశారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని గుర్తుంచుకోవాలని దానికి ఏం బదులిస్తారని నర్సిరెడ్డి నిలదీశారు.