తెలంగాణ

ఖానాపూర్‌లో టీఆర్‌ఎస్ కార్యకర్తల బాహాబాహీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖానాపూర్, అక్టోబర్ 27: టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు బయటపడ్డాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని మస్కాపూర్‌లో శనివారం విక్టోరియా స్టేట్ టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఉప్పు సాయిరా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా టీఆర్‌ఎస్ నాయకులు బాహాబాహీకి దిగారు.
వేదికపై తమను పిలువలేదని తమ ఫోను ఫ్లెక్సీలో పెట్టలేదని తిమ్మాపూర్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కడార్ల గంగనర్సయ్య అక్కడున్నవారిని ప్రశ్నించగా వివాదం చిలికి చిలికి పెద్దగా మారింది. టీఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ల రాజేందర్‌గౌడ్, కడార్ల గంగ నర్సయ్యలు గొడవపడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు దాడిచేసుకున్నారు. కార్యక్రమాన్ని ముగించుకుని తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్ తిరిగి వెళ్తుండగా ఈ వివాదం తలెత్తింది.
అక్కడే ఉన్న టీఆర్‌ఎస్ పార్ట్టీ మండలాధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్ వారించే ప్రయత్నం చేసినప్పటికి ఈ ఇరువురు నాయకులు తగ్గకుండా గొడవకు దిగి పిడిగుద్దులు గుప్పించుకున్నారు. ఎన్నికల వేళ టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బాహాబాహీకి దిగడం వల్ల ఈ వివాదం ఎటు దారి తీస్తుందోనని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది.

చిత్రం..గొడవ పడుతున్న టీ ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు