తెలంగాణ

జగన్‌కు 15 రోజుల విశ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 2: చేతికి గాయమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 15 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. దీపావళి పండుగ తర్వాత 10వ తేదీ నుంచి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాలనుకుంటున్న జగన్‌కు డాక్టర్లు ఈ మేరకు సూచన చేశారు. విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ చేతిపై శ్రీనివాస్ కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. గాయానికి డాక్టర్లు 9 కుట్లు వేయడం జరిగింది. ఆ గాయం పూర్తిగా మానలేదని, నడుస్తున్నప్పుడు చేతులు సహజంగానే ఊపుతామని, అప్పుడు కండరాలు కదిలి మళ్లీ కుట్ల నుంచి రక్తం స్రవించే అవకాశం ఉందని డాక్టర్లు ఆయనకు నచ్చజెప్పారు. అయినప్పటికీ జగన్ 10న ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇలాఉండగా ప్రజా సంకల్ప యాత్ర ఖచ్చితమైన తేదీని తర్వాత ప్రకటిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.