తెలంగాణ

నలుగురి కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: నలుగురి కోసం రాష్ట్రాన్ని నాశనం చేశారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై టీటీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ పార్టీలో ప్రాధాన్యత కోల్పోతున్న హరీష్‌రావు మహాకూటమిని తిట్టడం ద్వారా తన ఉనికిని చాటుకోవాలనుకోవడం సిగ్గుచేటని అన్నారు. నాలుగు సీట్ల కోసం విపక్షాలు రాజకీయం చేస్తున్నారని మాట్లాడే హరీష్‌రావు వారి కుటుంబంలోని నలుగురి కోసం రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నది వాస్తవం అవునో కాదో చెప్పాలని అన్నారు. మహాకూటమిలోని పార్టీలకు సిద్ధాంతాలు లేవని మాట్లాడే హరీష్ గతంలో ఇదే పార్టీలతో పొత్తుపెట్టుకున్నది గుర్తులేదా అని ప్రశ్నించారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి గులాంగిరి చేస్తుందని హరీష్ మాట్లాడే ముందు అమరుల ఆశయాల సాధన కోసం టీఆర్‌ఎస్ పార్టీ పనిచేస్తుందని చెబుతూ తెలంగాణ ద్రోహుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నది వాస్తవం కాదా అన్నారు. అమరులను పాడెను ఎక్కించిన ఘనత, తెలంగాణ ద్రోహులకు పదవులను కట్టబెట్టిన ఘనత మీది కాదా అని పేర్కొన్నారు. కోదండరామ్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని మాట్లాడే హరీష్‌రావు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని గతంలో మాట్లాడిన టీఆర్‌ఎస్ నేతలే అధికారంలోకి వచ్చిన తర్వాత కోదండరామ్ ఇంటి తలుపులు అర్ధరాత్రి పూట పగలగొట్టించినపుడు ఆత్మగౌరవం పెరిగిందని భావిస్తున్నారా అని నిలదీశారు. కూటమి వస్తే ప్రజా సంక్షేమం, టీఆర్‌ఎస్ వస్తే కుటుంబ సంక్షేమం అన్న విషయం తెలంగాణ ప్రజలకు అర్ధమైందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఎర్రన్నాయుడు వర్ధంతి సభ
టీడీపీనీ జాతీయ స్థాయికి తీసుకుపోయిన నేత కింజరాపు ఎర్రన్నాయుడు అంటూ టీటీడీపీ నేతలు శుక్రవారం నాడు కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎర్రం నాయుడు ఆరో వర్థంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు ఎర్రం నాయుడు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో సీనియర్ నేత మండవ వెంకటేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అమర్‌నాధ్ బాబు, ప్రధానకార్యదర్శి జి బుచ్చిలింగం, టీఎన్‌టీయుసీ అధ్యక్షుడు బిఎన్ రెడ్డి , ఇతర నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.