తెలంగాణ

ప్రజలకు దూరంగా కేసీఆరే ఒక్కరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: దేశంలోని ముఖ్యమంత్రుల్లో ప్రజలకు దూరంగా ఉండేది తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఒక్కరేనని కాంగ్రెస్ నేత, పుదుచ్ఛేరి సీఎం నారాయణ స్వామి వ్యంగ్యోక్తులు చేశారు. సోమవారం గాంధీ భవన్‌లో సీఎం నారాయణ స్వామి ఏఐసీసీ మీడియా ఇన్‌ఛార్జీ నసీర్ అహ్మద్, పీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ‘కేసీఆర్ ప్రజలకు దూరంగా, మహారాజులా ఉంటున్నారు’అని ఎద్దేవా చేశారు. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన కేసీఆర్ ప్రజలను కలిస్తేనే వారి సమస్యలు తెలుస్తాయన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకోకుండా ఎలా పరిపాలన చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ కనీసం తన సొంత మంత్రివర్గంలోని మంత్రులను కూడా కలవరని ఆయన ఆరోపించారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే రాష్ట్రాన్ని పాలిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తన కుటుంబం కోసమే పని చేస్తున్నారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన దుయ్యబట్టారు. ఇదేనా కేసీఆర్ సాధించిన ప్రగతి అని ఆయన నిలదీశారు.