తెలంగాణ

ప్రతి రౌండ్‌లోనూ సత్తాచాటిన టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, డిసెంబర్ 11: గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రాతినిత్యం వహిస్తున్న సీఎం కేసీఆర్ మరోసారి ఘన విజయం సాధించారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డిపై 58వేల 290 ఓట్ల మెజార్టీతో గెలుపొందగా, పోటీ పడిన ఇతర పార్టీలు, స్వతంత్రుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాగా పోలైన 2లక్షల 6వేల 707 ఓట్లకుగానూ 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు 1లక్షా 25వేల 444 ఓట్లు పోలవ్వగా, సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి 67154ఓట్లు పొందారు. అలాగే బీజేపీ అభ్యర్థికి 1587 ఓట్లు పడగా, స్వతంత్య్ర అభ్యర్థి గజ్జెల కనకయ్యకు 1023 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి జీడిపల్లి శ్రీనివాస్‌కు 892 ఓట్లు, బీఎల్‌ఎఫ్ అభ్యర్థి శ్రీరాముల శ్రీనివాస్‌కు 313 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి ఇమాంపురం యాదగిరిగౌడ్‌కు 226 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కడియం కృపాకర్‌కు 877 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి కంటె సాయన్నకు 3353 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి గుర్రపు రాములుకు 1229 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి బిట్ల వెంకటేశ్వర్లకు 1636ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి పెద్దసాయిగారి యాదగిరికి 1350 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి సతీశ్‌కు 810 ఓట్లు, నోటాకు 1624 ఓట్లు, 22 ఓట్లు రిజెక్ట్ అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి విజయేందర్‌రెడ్డి పేర్కొన్నారు.