ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర ఆర్థిక, సామాజిక స్థితిపై రెండు దశల్లో సమగ్ర సర్వే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 8: ఆంధ్రప్రదేశ్‌లో నివాసముండే ప్రతి కుటుంబానికి చెందిన ఆర్థిక, సామాజిక స్థితిపై సమగ్ర సర్వే నిర్వహించేందుకు రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల 20నుంచి 30వ తేదీ వరకు, మళ్లీ వచ్చే నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళిక ఖరారు చేసింది. రెండు దశల్లో ఈ సర్వే ముగుస్తుంది. ఈ సర్వేలో ప్రతి కుటుంబాన్ని 75 ప్రశ్నలు అడుగుతారు. దాదాపు 30 వేల మంది మున్సిపాలిటీ, రెవెన్యూ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొంటారు. ఈ సర్వే ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు పక్కదారి పడుతున్నాయా, లేదా లబ్ధిదారులకు మాత్రమే అందుతున్నాయా అనే వివరాలను ప్రభుత్వం తెలుసుకుంటుంది.
ఇంతవరకు దేశంలో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ తరహా సర్వేలు నిర్వహించాయి. ప్రజల నుంచి సేకరించిన ఈ డేటాకు పీపుల్స్ హబ్‌గా నామకరణం చేశారు. ఆధార్ డేటాలో 9 అంశాలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ సమాచారాన్ని ప్రజల నుంచి ప్రభుత్వ అధికారులు సేకరించనున్నారు. ఈ సమాచారాన్ని స్టేట్ డాటా రెసిడెంట్ హబ్‌లో నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్ని ప్రజాబాహుళ్యంలో ఉంచరు. అత్యంత గోప్యంగా ఈ సమాచారాన్ని ఉంచుతారు. సమాచారాన్ని సేకరించిన తర్వాత ఆయాశాఖల ద్వారా క్రోడీకరిస్తారు. 75 ప్రశ్నల్లో 35 ప్రశ్నలకు సమాధానాలు రవాణాశాఖ, రెవెన్యూ రికార్డు, ఆధార్ కార్డుల్లో ఉన్నాయి. కాని వీటిని అనుసంధానం చేయాలంటే ప్రభుత్వానికి కత్తిమీద సవాలుగా మారింది. అలా కాకుండా ఆర్థిక, సామాజిక స్థితిగతులను కూడా జోడించి అడగడం వల్ల ఒక కుటుంబం సమాచారాన్ని మొత్తం ప్రభుత్వం దగ్గర ఉంటుందని ఐటి శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. ఆరోగ్యం, ఆర్థిక, అకడమిక్ డేటాల్లో ఆసక్తికరమైన అంశాలు వెల్లడి కానున్నాయి. మతం,కులం, రేషన్ కార్డు, బ్యాంకు అకౌంట్లు, పెన్షన్లు, ఇంటి ఓనర్‌షిప్ హక్కులు, కరెంటు కనెక్షన్, మరుగుదొడ్లు, భూమి తదితర వివరాలను ప్రభుత్వం సేకరించనుంది. ప్రజల స్థిర,చరాస్తుల వివరాలు కూడా 75 ప్రశ్నల్లో ఉన్నాయి. ఈ డేటాను ఓరాకిల్ సంస్ధ పర్యవేక్షిస్తుంది.